శాంతిపురం మండలం రాళ్ల
బూదుగురు పంచాయితీలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం బాటిళ్లను చిందరవందరగా పారేశారు. ఈ ఘటనపై పాఠశాల సమీప గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను మీడియాకు తెలియజేసిన గ్రామస్తులు, అధికారులు త్వరలో స్పందించి, పాఠశాల ఆవరణలో ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.