అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని ఆరోగ్య మాత స్కూల్లో గురు హాకీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సమ్మర్ క్యాంప్లో భాగంగా, సీనియర్ రాష్ట్ర నాయకులు కట్టా దొరస్వామి నాయుడు సమక్షంలో డీఎస్పీ పావని విద్యార్థులకు హాకీ పరికరాలను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ పావని, విద్యార్థులు సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గురు భాస్కర్, ప్రసాద్ రెడ్డి, మేరీ పునీత, కోచ్లు నౌషాద్, గౌస్, సుల్తాన్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. క్రీడలతోనే మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.