
నగరి: ఉన్నత పాఠశాల విద్యార్థులకు విద్యాసామాగ్రి పంపిణీ
నగరి నియోజకవర్గం, వడమాల పేట మండలంలోని ఉన్నత పాఠశాలలో శుక్రవారం బహుజన సేవా సంఘం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు విద్యాసామాగ్రిని అందజేశారు. పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాతలు విద్యార్థులను ప్రోత్సహిస్తూ, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. పాఠశాల సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






































