నగరి నియోజకవర్గంలోని విజయపురంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని ఆధునీకరించి, శుక్రవారం నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ ప్రారంభించారు. ప్రజల రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆయన సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.