చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు నగరి పోలీస్ స్టేషన్లో మంగళవారం హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారి తమ సిబ్బందితో మాట్లాడుతూ, మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవడం, ఏకాగ్రతను మెరుగుపరచుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి గడపడంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.