నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ వార్డు మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం బుధవారం రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య సంఘీభావం తెలుపుతూ, 300 కుటుంబాలకు మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పట్టణ కమిషనర్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.