చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని వైయస్సార్ జంక్షన్ వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి తిరుపతి వైపునకు కారు వెళ్తున్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు.