ఫలితాలు ఏవైనా పిల్లలను అక్కున చేర్చుకోవాలని, మార్కులు జీవితాన్ని శాసించలేవని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ గురువారం తెలిపారు. విద్యార్థుల జీవిత గమనాన్ని ఫలితాలు శాసించేవి కావని, సుదీర్ఘ ప్రయాణంలో ఇదొక చిన్న మలుపు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. ఓటమి అనేది గెలుపుకు తొలిమెట్టు కావాలే తప్ప, జీవితానికి ముగింపు కాకూడదని ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలని ఆయన కోరారు.