వి కోట బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

1644చూసినవారు
పలమనేరు నియోజకవర్గంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విలేఖరి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం పలమనేరు ఎమ్మెల్యే సతీమణి రేణుక రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన వారిని ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్