
పులి దాడిలో దూడ మృతి
ఐరాల మండలం వడ్రంపల్లి గ్రామంలో రైతు ఎం. కిషోర్ కుమార్ కు చెందిన దూడపై పులి దాడి చేసి చంపేసింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజర్ కిరణ్, వెటర్నరీ డాక్టర్ శిరీష ఘటనా స్థలాన్ని పరిశీలించి, పులి దాడిలో దూడ చనిపోయినట్లు ధృవీకరించారు. రైతుకు సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కిరణ్ తెలిపారు. గ్రామస్థులను అడవి వైపు వెళ్లవద్దని సూచించారు.






































