యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించడం వల్ల మానసిక ఉల్లాసం, ఆరోగ్యం కలుగుతుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరు మండలంలోని సుగాలిమిట్టలో ఏర్పాటు చేసిన
క్రికెట్ టోర్నమెంట్ను సందర్శించి, యువతను ఉత్సాహపరిచేందుకు ఎమ్మెల్యే స్వయంగా బ్యాట్ పట్టి కాసేపు
క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు ఎమ్మెల్యేను కలిసి తమ వినతులను సమర్పించారు.