చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, రాజీవ్ కాలనీ సమీపంలో గల నల్లప్ప గారి కుంట చెరువుకు శుక్రవారం గండి పడింది. దీంతో నీరు వృధాగా పోతుండటాన్ని గుర్తించిన రైతులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న రెవెన్యూ అధికారులు గండి పడ్డ ప్రదేశంలో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు.