సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఆకలితో అలమటిస్తున్న పేదలకు కిలో బియ్యం కేవలం 2 రూపాయలకు అందించి వారి ఆకలి తీర్చిన మహాత్ముడు
ఎన్టీఆర్ అని కొనియాడారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నారాయణవనం మండల కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి,
ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు.