సత్యవేడు నియోజకవర్గంలోని పలు ప్రజా సమస్యలు, పెండింగ్ పనులపై ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. టీటీడీ కళ్యాణ మండపం స్థలం, భూముల ఆక్రమణలు, హాస్టల్ బిల్లులు, ఖాళీ పోస్టుల భర్తీ వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఈ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.