సత్యవేడు నియోజకవర్గంలో ప్రోటోకాల్ వివాదం తీవ్రమైంది. సోమవారం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయ కార్యక్రమాల పోస్టర్లలో ఎమ్మెల్యే ఆదిమూలం పేరు లేకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడం సరికాదని, దేవుడే చూసుకుంటాడని ఆయన ఈఓ లతను ప్రశ్నించారు. ఈఓ క్షమాపణ చెప్పినప్పటికీ, ఎమ్మెల్యే దేవాదాయ శాఖ మంత్రికి ఫిర్యాదు చేశారు.