దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో గురుదక్షిణామూర్తికి గురువారం నాడు విశేష అభిషేకం జరిగింది. కలస్థాపన, గణపతి పూజ, పుణ్యా వచనంతో పాటు కలశానికి పుష్పాలతో పూజలు నిర్వహించారు. అనంతరం, పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో గురుదక్షిణామూర్తికి అభిషేకం చేశారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి, పూజలు చేసి, హారతులు సమర్పించారు.