తొట్టంబేడు మండల తెలుగు యువత అధ్యక్షుడు పవన్ నాయుడు, మే 27 నుంచి 29 వరకు జరిగే తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక మహానాడుకు కార్యకర్తలు, యువత భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. తొట్టంబేడు మండలం నుంచి యువత,
టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు. మహానాడు వేదికగా పార్టీ విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ జరుగుతుందని, యువత పాత్ర కీలకమని తెలిపారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ సిద్ధాంతాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.