
భర్తలను చంపిన ఆ ఇద్దరు మహిళలు ఒకే జైలులో
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భర్తలను హత్య చేసిన ఇద్దరు మహిళలు ఒకే జైలులో (బ్యారక్లో) శిక్ష అనుభవిస్తున్న ఘటన యూపీలోని మీరట్ జిల్లా జైలులో వెలుగులోకి వచ్చింది. ఇటీవల ప్రియుడితో బంధానికి అడ్డుగా ఉన్నడని భర్తను పాముతో కాటు వేయించి చంపిన భార్య దామినిని మీరట్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. గతంలో ప్రియుడితో కలిసి భర్తను చంపి బ్లూ డ్రమ్ములో పెట్టిన ముస్కాన్ రస్తోగి ఉన్న బ్యారక్లోనే దామినిని వేశారు. అయితే ప్రియుడు తుషార్ను ఒక్కసారి కలుస్తానని దామిని పదేపదే ఏడుస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




