ముక్కంటి సన్నిధిలో ఎండోమెంట్ ఐఏఎస్ సెక్రటరీ

3చూసినవారు
ముక్కంటి సన్నిధిలో ఎండోమెంట్ ఐఏఎస్ సెక్రటరీ
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానలయంలో ఎండోమెంట్ సెక్రటరీ డాక్టర్ హరి జవహర్ లాల్, IAS, తన కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేశారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టే సాయిప్రసాద్, కార్యనిర్వాహణాధికారి BK వెంకటేశులు ఆయనకు స్వాగతం పలికి, రాహు కేతు పూజలు, అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్, కార్యనిర్వాహణాధికారితో పాటు ప్రధాన అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్