వెంకటగిరి పట్టణంలోని రాజా ప్యాలెస్లో యువరాజు సర్వజ్ఞ కుమార కృష్ణ యాచేంద్రను హిందూ పరిషత్ సభ్యులు రామకృష్ణ కలిసి హనుమాన్ శోభాయాత్రకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా శోభాయాత్రకు సంబంధించిన పలు విషయాలను వివరించారు. యువరాజు హనుమాన్ శాశ్వత ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరిపై హనుమాన్ స్వామి కృప ఉండాలని ఆకాంక్షించారు.