వి. కోటలో ఆంధ్రజ్యోతి విలేఖరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంటలో జర్నలిస్టులు మంగళవారం నిరసన చేపట్టారు. రేణిగుంట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని, మృతుడి చిత్రపటానికి నివాళులర్పించి, రెండు నిమిషాల మౌనం పాటించారు. అనంతరం హత్యను ఖండిస్తూ, జర్నలిస్టులపై దాడులను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.