ముక్కంటి సన్నిధిలో సింగర్ తమన్
సంగీత దర్శకుడు శ్రీ తమన్, గాయకులు శ్రీకృష్ణ, శృతి రంజని, అద్వితీయ శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయానికి విచ్చేసి యున్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ వారిని సాదరంగా ఆహ్వానించి, అంతరాలయ దర్శనం మరియు వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు నాగరాజు, AEO మోహన్, పురోహితులు అర్ధగిరి ప్రసాద్, APRO రవి, దుర్గాప్రసాద్, అభిషేక్, సాయి పాల్గొన్నారు.
