10వ తరగతి ఫలితాల నేపథ్యంలో విద్యార్థులు అపజయాలకు నిరుత్సాహపడవద్దని రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. జీవితంలో విజయం, అపజయం సహజమని, ఫెయిల్ అయినా ధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలని, ఒత్తిడి చేయవద్దని కోరారు. మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విద్యార్థులు కౌన్సెలింగ్ కోసం పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ తెలిపారు.