సనాతన ధర్మ పరిరక్షణ లక్ష్యంగా
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయ సాధనలో భాగంగా, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ కొట్టే సాయి మిత్ర బృందం తిరుపతి జిల్లా శ్రీనివాసపురం గ్రామంలో తాగునీటి బోరు బావిని ఏర్పాటు చేసింది. ధర్మరాజుల తిరుణాల సందర్భంగా అగ్నిగుండ మహోత్సవంలో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను గమనించిన తాటిపర్తి అనిల్ రెడ్డి, ఈ విషయాన్ని కొట్టే సాయి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బోరు బావిని వేయించారు.