సూళ్లూరుపేటలో ఇంచార్జి ఆర్డీవోగా పనిచేస్తున్న వి. దేవేంద్ర రెడ్డిని ప్రభుత్వం రెగ్యులర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)గా నియమించింది. తిరుపతిలోని కెఆర్ఆర్సీలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్న ఆయన ప్రస్తుతం సూళ్లూరుపేట ఇంచార్జి ఆర్డీవో బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నియామకంతో సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిపాలన మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.