నాయుడుపేట మండలం విన్నమాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులకు 0.85 సెంట్ల భూమికి సంబంధించిన పట్టాను జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ ఆదేశాలతో తహసీల్దార్ వారి ఇంటికి వెళ్లి అందజేశారు. 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించి పట్టా జారీ చేయడంతో ఐదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ భూ సమస్యకు పరిష్కారం లభించింది. ఈ సంఘటన బాధితులకు ఊరటనిచ్చింది.