తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిరం సెంటర్ నుంచి పిచ్చిరెడ్డి తోపు వరకు ఉన్న రహదారి గుంతలు, చెడిపోయిన బ్లాక్టాప్ కారణంగా వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శనివారం పరిశీలించారు. రహదారిని సుస్థిరంగా పునర్నిర్మించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాకపోకలు సురక్షితంగా, సక్రమంగా సాగేందుకు పనులు త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.