తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఏర్పాటు

17చూసినవారు
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో సైకాలజీ విభాగంలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన కలకలం రేపింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన విద్యార్థులతో హెచ్ఓడి విశ్వనాథ రెడ్డి "ర్యాగింగ్ చేస్తారు, ఏమైనా చేస్తారు" అని వ్యాఖ్యానించినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై విద్యార్థి సంఘాలు హెచ్ఓడి సస్పెన్షన్ కోరుతున్నాయి. యూనివర్సిటీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణకు ఆదేశించింది, అయితే కమిటీలో విద్యార్థి సంఘ ప్రతినిధులను చేర్చాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్