తిరుమలలోని బాలాజీ నగర్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నాగుపాము కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు వెంటనే అక్కడికి చేరుకుని చాకచక్యంగా పామును పట్టుకున్నారు. అనంతరం, ఆ పామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఈ సంఘటనతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో కలకలం రేగింది.