తిరుమల తరహాలో టిటిడి పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాలను అందించాలని టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం టిటిడి పరిపాలనా భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో, అన్నప్రసాదాల తయారీ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, పంపిణీని పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. టిటిడి ఆధ్వర్యంలోని ఆలయాలలో అభివృద్ధి పనులపై కూడా ఈవో సమీక్షించారు.