తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నట్లు వెల్లడించారు. ఇటీవలే ప్రముఖ నగరాలైన తిరుపతి, విశాఖపట్నంలో ఇంజినీరింగ్ కళాశాలలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విస్తరణ ప్రణాళికల ద్వారా విద్యా రంగంలో తనదైన ముద్ర వేయాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.