కోస్తా తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా, ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, కడప, TPT జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం, తెలంగాణలో హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో నేటితో వర్షాలు ముగియనున్నాయి. ఈ సమాచారాన్ని APSDMA వెల్లడించింది. ఈ వాతావరణ మార్పుల వల్ల పలు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.