టీటీడీకి నెయ్యి సరఫరాలో కీలక మార్పులు అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ హయాంలోనే జరిగాయని వన్మ్యాన్ కమిషన్ ఛైర్మన్ దినేశ్ కుమార్ నివేదిక వెల్లడించింది. 2020 ఫిబ్రవరిలో, అప్పటి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన బోర్డు మీటింగ్లో టెండర్ కండిషన్ నంబర్ 19, 20లను తొలగించారు. ఆ సమయంలో మెంబర్ సెక్రటరీగా ఉన్న సింఘాల్ ఈ నిర్ణయాన్ని అడ్డుకోకపోవడంతోనే కల్తీ జరిగిందని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.