తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి చెందిన పలు ట్రస్ట్లకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ రూ. 3 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ విరాళానికి సంబంధించిన డిడిని శనివారం టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో అనిల్ కుమార్ సింఘాల్కు దాత అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దాతను అభినందించారు.