బుధవారం, టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీవేంకటేశ్వర శ్రవణం సంస్థను పరిశీలించారు. వినికిడి లోపం గల పిల్లలకు ఆధునిక పద్ధతుల్లో ప్రత్యేక శిక్షణ అందించాలని ఆయన సూచించారు. పిల్లల తల్లులతో మాట్లాడి, వారికి సమయానికి ఆహారం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా టిటిడి డిఈవో వెంకట సునీల్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, శ్రవణం సిబ్బంది ఈవోకు స్వాగతం పలికారు.