తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ పాత భవనాన్ని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ మంగళవారం అధికారులతో కలిసి పరిశీలించారు. 2006 వరకు ఇక్కడ హైస్కూల్ నడిచిన ఈ భవనాన్ని 2010లో పోలీసు శాఖకు అప్పగించారు. ఇటీవల భక్తుల ఫిర్యాదుతో, 150 ఏళ్ల చరిత్ర గల ఈ భవనాన్ని టిటిడి తిరిగి స్వాధీనం చేసుకుని హైస్కూల్ పునఃప్రారంభించాలనే సూచనల నేపథ్యంలో ఈ పరిశీలన జరిగింది. ప్రస్తుతం పోలీస్ క్యాంటీన్, సంక్షేమ శాఖలు ఇక్కడ కొనసాగుతున్నాయి.