తిరుపతి నగరంలో మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్దరణ చర్యలు వెంటనే చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో, డ్రైనేజి కాలువలు, రోడ్లు పాడైన ప్రాంతాల్లో పునరుద్దరణ పనులు చేపట్టాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు.