తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, స్వాతంత్ర్య పోరాటంలోనూ, దేశ సంస్థానాల విలీనంలోనూ కీలక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, గురువారం నగరంలోని మహాత్మ జ్యోతిరావ్ పూలే విగ్రహం నుంచి కచ్చపి ఆడిటోరియం వరకు 'మై భారత్ చిత్తూరు, తిరుపతి జిల్లా శాఖలు' ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ నిర్వహించారు.