AP: కూటమి మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, వారిని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. దీనిపై తాజాగా మంత్రులతో జరిగిన టెలికాన్ఫరెన్సులో సీఎం సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. "ప్రతి విషయాన్నీ నేనే స్వయంగా చెప్పాలంటే కుదరదు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ మిషన్ మోడ్తో పనిచేయాలి. మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదు" అంటూ ఆయన మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని ప్రచారం జరుగుతోంది.