AP: సీఎం చంద్రబాబు నాయుడు పలు శాఖలు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హోం, మున్సిపల్, రెవెన్యూ శాఖలపై ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలు తేల్చాయని కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. హోం, మున్సిపల్ శాఖలు సరిగా పని చేయడం లేదని తనకు ఫీడ్బ్యాక్ వచ్చినట్లు తెలిపారు. అన్ని శాఖల మంత్రులు, అధికారులు వెంటనే ఫైళ్లను క్లియర్ చేయాలని ఆదేశించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.