తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. నవంబర్ 24వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన 'రైతన్నా మీకోసం' కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో రైతుల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న పనులను వివరిస్తారు. రైతును రాజును చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలియజేయనున్నారు.