ఆంధ్రప్రదేశ్కు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నేటి (ఆదివారం) నుంచి రెండు రోజులపాటు సింగపూర్ పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రతిష్టాత్మక వరల్డ్ సిటీ సమ్మిట్లో పాల్గొనడంతో పాటు సింగపూర్ ప్రధానితో, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో భేటీ కానున్నారు. అమరావతి రెండో దశ అభివృద్ధి మాస్టర్ప్లాన్పై చర్చలు జరపడంతో పాటు గూగుల్ క్లౌడ్ ప్రతినిధులు, యూఎన్ హాబిటాట్ అధికారులతో సమావేశమవుతారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించే బిజినెస్ రోడ్షోలో పాల్గొని ఏపీలో పెట్టుబడి అవకాశాలను సీఎం వివరిస్తారు.