AP: 'మోంత' తుఫాను ప్రభావం, పంట నష్టంపై సీఎం చంద్రబాబు నాయుడు గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంట నష్టానికి సంబంధించిన పూర్తి నివేదికను ఐదు రోజుల్లో సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. తుఫాన్ కారణంగా వరి, మొక్కజొన్న, పత్తి, అరటి, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రాథమిక అంచనాకు వచ్చింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.