AP: సంక్రాంతి సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని కందరాడ గ్రామంలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పిల్లా శివశంకర్, మర్రి రాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పందేలలో భారీ బహుమతులు ఆకర్షణగా నిలిచాయి. కోడి పందేలలో విజయం సాధించిన వారికి మహింద్రా థార్ వాహనం, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ను బహుమతిగా అందించారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరుకావడంతో గ్రామం మొత్తం పండుగ వాతావరణాన్ని తలపించింది.