దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. జూన్ 14, ఆదివారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో
నీట్-యూజీ పరీక్షల పేపర్ లీకేజీలు, NTA అవకతవకలకు నిరసనగా భారీ శాంతియుత నిరసన సభ నిర్వహించనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, "మాకు మేక్ ఇన్
ఇండియా అడిగితే.. మీరు 'లీక్ ఇన్
ఇండియా' ఇచ్చారు" అనే నినాదాలతో యువత పాల్గొంటుంది. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ హాజరుకానున్నారు.