AP: ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై మాలల రాజ్యాధికార సాధన సమితి తీవ్రంగా స్పందించింది. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది. అలాగే జాతీయ మహిళా కమిషన్, జాతీయ లోకాయుక్త, జాతీయ లోక్పాల్, జాతీయ ఎస్సీ కమిషన్లకు కూడా వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపింది. అరవ శ్రీధర్పై వచ్చిన ఆరోపణలపై స్వతంత్రంగా విచారణ జరిపేందుకు ప్రత్యేక కమిషన్ను ఏర్పాటు చేయాలని సమితి డిమాండ్ చేసింది. ఈ విషయంలో కేంద్ర స్థాయిలో తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.