AP: విశాఖలో జరిగిన సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్పై వ్యాఖ్యలను సీపీఐ రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు పనిలేకుండా జీతాలు తీసుకుంటున్నారనడం తెలుగు జాతిని అవమానించడమేనని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ఆర్సిలర్ మిట్టల్కు క్యాప్టివ్ మైన్స్ అడుగుతారు కానీ, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు అడగరని ప్రశ్నించారు.