ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,534 కోట్లను మంజూరు చేసింది. కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లతో, కేంద్ర ఉద్యోగుల నివాస సముదాయాల కోసం రూ.1,234.91 కోట్లతో ప్రాజెక్టు డీపీఆర్లు సిద్ధమయ్యాయి. ఈ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దీనితో అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి.