ఏపీలోని పాడేరు ఏజెన్సీలోని చింతలపాలెంలో ఈనెల 23న రామన్న అనే 73 ఏళ్ల వృద్ధుడిని అతని స్నేహితుడు వంతల సోమన్న, అతని భార్య దేవితో కలిసి అప్పు తీర్చమని అడిగినందుకు సజీవదహనం చేశారు. రామన్న కొడుకుపై కత్తితో దాడి చేసి, ఆపై రామన్నపై దాడి చేసినట్లు తెలుస్తోంది. రామన్నన్ను ఇంట్లో వదిలేసి ఇంటికి నిప్పుపెట్టి పారిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో మంటల్లో చిక్కుకున్న వృద్ధుడు సజీవదహనమైనట్లు స్థానికులు వివరించారు. డ్రోన్ల సహాయంతో పోలీసులు నిందితులను అడవిలో పట్టుకున్నారు.