తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

9298చూసినవారు
తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
AP: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 59,834 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,628 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.49 కోట్లుగా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్